రహి కేర్ డయాలసిస్ నాగార్జున నాయక్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పుల్లల చెరువు అఖండ భూమి జనవరి 26 న్యూస్
ఎర్రగొండపాలెం ఏరియా హాస్పిటల్ నందు సోమవారం గణతంత్ర దినోత్సవం వేడుకలు డయాలసిస్ మేనేజర్ నాగార్జున నాయక ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ చలపతి నాయక్, ఏరియా హాస్పిటల్ సూపర్నెట్ యాదయ్య, ముందుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ చలపతి నాయక్, మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ, భారత రాజ్యాంగం గొప్పతనాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. అదేవిధంగా ఐసి రూమ్ లో ఉన్న డయాలసిస్ పేషంట్లకి బ్రెడ్, పండ్లు, పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా డయాసిస్ పేషెంట్లతో డాక్టర్ చలపతి నాయక్ మాట్లాడుతూ డయాలసిస్ పేషెంట్ కి ముఖ్యంగా కావలసింది బ్లడ్ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంతా మంచిగా ఉంటమణి ముఖ్యంగా వారానికి రెండుసార్లు డయాలసిస్ కంపల్సరీ చేయించుకోవాలని బ్లడ్ టెస్ట్, క్రియేట్ ఎంతుంది అనేది, మంత్లీ మంత్లీ కచ్చితంగా టెస్టులు చేపించుకోవాలని వారు కోరారు.. ఈ కార్యక్రమంలో డయాలసిస్ మేనేజర్ నాగార్జున నాయక్, టెక్నీషియన్ అఖిల్ వర్మ, సిబ్బందిని పాల్గొన్నారు..


