సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి కన్నుమూత
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 2 (అఖండ భూమి న్యూస్);
సీనియర్ నటుడు రఘునాథ రెడ్డి కన్నుమూత.
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ నటుడు రఘునాథరెడ్డి కన్నుమూశారు. నెల రోజుల క్రితమే కుమారుడు గుండెపోటుతో మరణించడంతో ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. అదే బాధతో శనివారం రాత్రి ఆయనకు కూడా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. రఘునాథరెడ్డి సుమారు 350 చిత్రాల్లో నటించారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


