తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 2 (అఖండ భూమి న్యూస్);
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫిబ్రవరి 26 నుండి మార్చి 02వ తేదీ వరకు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు శ్రీరామచంద్రమూర్తి, రెండవ రోజు శ్రీకృష్ణస్వామి, మూడవ రోజు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు, నాలుగో రోజు ఐదుసార్లు, చివరి రోజు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.


