*క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విశాఖలో ఐపీల్ మ్యాచ్ లు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 12 (అఖండ భూమి న్యూస్);
ఐపీఎల్ -2026లో విశాఖ వేదిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏ సి ఏ-వి డి సి ఏ స్టేడియంలో కనీసం రెండు మ్యాచ్లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ వేదికను హోం గ్రౌండ్ గా ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే.ఈ వేదిక డీసీ(DC)కి కలిసి రాగా ఈ ఏడాది కూడా మ్యాచుల నిర్వహణకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయమై ఆంధ్ర క్రికెట్ సంఘం డిసిని సంప్రదించగా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది.


