మార్చిలో జిల్లా , మండల పరిషత్ ఎన్నికలు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఫిబ్రవరి 12.
(అఖండభూమి న్యూస్):
మార్చి మాసంలో జిల్లా , మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. బుధవారం నాడు జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తున్నాయని వివిధ సర్వేలు ప్రకటించడంతో అదే జోష్ ను కొనసాగించేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మండల, జిల్లా పరిషత్తుల ఎన్నికలు పూర్తయి. పాలకవర్గాలు ఏర్పడితే కేంద్రం నుండి రావలసిన నిధులు వచ్చేందుకు అవకాశాలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సకాలంలో ఎన్నికలు పూర్తికాకుంటే మండల, జిల్లా పరిషత్తులకు కేంద్రం నుండి 450 కోట్ల నిధులు మునిగిపోయే ప్రమాదం ఉందని కాబట్టి సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ యోజన. అందుకే పరిషత్ ఎన్నికలు త్వరితగతిన నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది.
You may also like
జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్–2025 (2వ ఎడిషన్) ఘనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ …
2026 ఆర్థిక అక్షరాస్యత దినోత్సవం ర్యాలీ…
సీఎం కప్ కామారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ ఫైనల్ విన్నర్ మాన్యశ్రీ*
*కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి.*
మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర …


