అధ్వానంగా మారిన రోడ్లు బాగయ్యేదెప్పుడు?

నాతవరం మే 18 అఖండ భూమి.

నాతవరం మండల పరిధిలోని చాలా రోడ్లు పాడవడం తో ప్రజలు ఇబ్బందులుకు గురౌతున్నారని వైసిపి ప్రభుత్వం ఏర్పడి కాలం గడిచిపోతున్నా రోడ్ల పరిస్థితి మారలేదు ఇప్పటికైనా రోడ్ల పై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలని మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకట రమణ డిమాండ్ చేశారు ఇందులో మన్యపురుట్ల సెంటర్ నుంచి మన్యపురుట్ల లింగంపేట మరియు కొత్తూరు పోవు రోడ్డు మరీ అధ్వాన్నం గా ఉందని ఈ మార్గం పెద్ద పెద్ద గ్రోతులతో పూర్తిగా పాడై ఆ రోడ్డున ప్రయాణించే వాహన దారులకు ఇబ్బందికరం గా మారిందని ఆయన అన్నారు అంతే కాకుండా ఈ రోడ్డు చాలా ఊర్లకు అనుసంధానంగా ఉందని తరచూ వాహనదారులు వాహనాలపై వెళుతూ ప్రమాదాలకు గురై గాయాలు పాలవుతున్నా కనీసం మరమ్మత్తులు కూడా చేపట్టడం లేదని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రోడ్లను బాగు చేయాలని ఆయన డిమాండ్ చేశారు” width=”235″ height=”300″ class=”alignnone size-medium wp-image-1668″ />

Akhand Bhoomi News

error: Content is protected !!