కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…

కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మార్చి 23 (అఖండ భూమి న్యూస్)

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన నర్సాగౌడ్ కుమారుడు అరవింద్ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయవలసిందని చెప్పగానే ఆర్ధిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగ వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ వెంటనే స్పందించారు. నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి నర్సాగౌడ్ కుమారుడు అరవింద్ గౌడ్ కి ప్రభుత్వ తరపు నుండి చికిత్స నిమిత్తం 2,50,000/- రూపాయలు ఎల్. ఓ. సి ఇవ్వడం జరిగింది.

 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ కి అరవింద్ గౌడ్ కుటుంబసభ్యులు కృతఙ్ఞతలు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!