జగన్‌ ఏం చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్‌ కల్యాణ్‌

 

 

అమరావతి అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి విమర్శల బాణం ఎక్కుపెట్టారు. అన్నమయ్య డ్యామ్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం, మోసాలను వివరిస్తూ ఆయన వరుస ట్వీట్లు చేశారు..

”గతంలో భారీ వర్షాలకు అన్నమయ్య డ్యామ్‌ మట్టికట్ట తెగింది. భారీగా వచ్చిన వరదల వల్ల పలువురు జల సమాధి అయ్యారు. ఈ ఘటనపై సీఎం జగన్‌ వేసిన ఉన్నతస్థాయి కమిటీ ఏమైందో? ఆయన ఏం చర్యలు తీసుకున్నారో దేవుడికే ఎరుక. ఏడాదిలో డ్యామ్‌ను పునర్నిర్మిస్తామన్న హామీ ఏమైంది? రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అస్మదీయుడు పొంగులేటికి పనులు అప్పజెప్పారు. 18 నెలలవుతున్నా నేటికీ అక్కడ వీసమెత్తు పనులు చేయలేదు” అని పవన్‌ ఆరోపించారు..

Akhand Bhoomi News

error: Content is protected !!