మాతృమందిర్ ప్లే స్కూల్ లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం

మాతృమందిర్ ప్లే స్కూల్ లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం

 

బెల్లంపల్లి ఏప్రిల్ 04(అఖండ భూమి న్యూస్):బెల్లంపల్లి పట్టణంలోని మాతృమందిర్ ప్లే స్కూల్ లో శనివారం నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు హాజరయ్యారు.

సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలను తిలకించి,ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని అభినందించడం జరిగింది.. ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ…పిల్లలలో సృజనాత్మకతను వెలికితీయడానికి అలాగే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి ఇటువంటి సైన్స్ ఫెయిర్ లు ఎంతగానో ఉపయోగపడతాయని,సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఏర్పాటు చేసిన మాతృమందిర్ ప్లే స్కూల్ యాజమాన్యానికి వారు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 20వ వార్డ్ కౌన్సిలర్ తాండ్ర స్రవంతి-రామకృష్ణ,32వ వార్డ్ కౌన్సిలర్ నీలి హారిక- కృష్ణ తదితరులు పాల్గొన్నారు…

Akhand Bhoomi News

error: Content is protected !!