విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగు దీపం”

విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగు దీపం”

 

బాల అకాడమీకి విజయోత్సవ కిరీటం-46 ఏళ్ల విజయ గాథకు ఘన ఆవిష్కరణ ‌. ‘విలువల విద్యతో వేలాది విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగు దీపం”

: బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్‌ 46 సంవత్సరాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహణకు సిద్ధం

నంద్యాల: నగరంలోని బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్‌ తన 46వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 46 సంవత్సరాల విద్యా ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ విద్యాసంస్థ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విశేష సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఈ సందర్భంగా ఏప్రిల్ 9, 2026న ఉదయం 11:00 గంటలకు నంద్యాల డి.వై.ఆర్ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ మరియు ప్రేరణాత్మక వక్త శ్రీ వేణు కళ్యాణ్  హాజరవుతున్నారు.

“మిషన్: బిల్డింగ్ ఫ్యూచర్ వారియర్స్” అనే లక్ష్యంతో విద్యార్థులను తీర్చిదిద్దుతూ, తల్లిదండ్రులకు మార్గనిర్దేశం చేస్తూ, ఉపాధ్యాయులను శక్తివంతం చేసే దిశగా ఈ కార్యక్రమం సాగనుంది. విద్య, క్రమశిక్షణ, విలువలతో కూడిన బోధన ద్వారా సమాజానికి ఉత్తమ పౌరులను అందించడం మా సంస్థ ధ్యేయంగా కొనసాగుతోంది.

స్కూల్ నిర్వాహకులు ఎం.జి.వి. రవీంద్రనాథ్  మరియు ఆర్. మాధవి లత ఈ వేడుకను సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

బాల అకాడమీ తన విద్యా ప్రస్థానంలో కొత్త మైలురాయిని చేరుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తూ, ఈ విజయోత్సవ వేడుకలు విద్యా రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలవనున్నాయి.

Akhand Bhoomi News

error: Content is protected !!