ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశం 22 న సత్య కన్వెన్షన్ హాల్
…
ప్రజా ప్రతినిధులు , పాత్రికేయ మిత్రులు…
జిల్లా అధికారులు
ఆహ్వానించిన జిల్లా కలెక్టర్ ..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 21 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి సమావేశం ఈ నెల 22న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు.
ఈ సమావేశం 22-05-2026 శుక్రవారం ఉదయం 10.00 గంటలకు కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్లో జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల పురోగతి, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, శాఖల సిబ్బందినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
You may also like
*ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు: రోగులకు పండ్ల పంపిణీ…*
ఆసుపత్రికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు – కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
దోమకొండ లో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి…
*స్పోర్ట్స్ డేలో స్వర్ణం సాధించిన జనగామ రోహిన్ రెడ్డి…


