ఆసుపత్రికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు – కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి 

ఆసుపత్రికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు

– కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 21. (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోనీ దోమకొండ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖాన ఆవరణలో నిర్వహించిన హెచ్ డి సి ( హాస్పిటల్ డెవలపెంట్ కమిటీ) సమావేశంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా వైద్యులు మరియు ఆసుపత్రి అధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అని, పేద వారు మాత్రమే ప్రభుత్వ దవాఖాన కి వస్తారు కాబట్టి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, అత్యవసరం అయితే తప్ప రోగులు జిల్లా కేంద్రానికి పోకుండా సేవలు అందించాలి అని అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ప్రస్తుతం ఉన్న సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

Akhand Bhoomi News

error: Content is protected !!