దోమకొండ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధ; జూన్ 2 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో త్రివర్ణ పతాకంను స్థానిక తహసీల్దార్ ఎగురవేశారు. జాతీయ గీతం తో పాటు తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వారి సేవలను కొనియాడారు. అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకు నడిపే బాధ్యతగా ప్రతి ఒక్కరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులతో పాటు, ఆయా పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.


