బిబిపేట ఆర్యవైశ్యుల కైలాస్ మానస సరోవర యాత్ర…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 8 (అఖండ భూమి న్యూస్);
పరమశివుడు ఆవాసం ఉండే కైలాస పర్వతం లో గల మానససరోవర్ యాత్రకు బీబీపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు సోమవారం వెళ్లారు. 12 రోజుల పాటు జరిగే సంక్లిష్ట ఈ విహారయాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం వెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మురికి శ్రీనివాస్ , తడుపునూరి రమేష్, ఎర్రం ప్రసాద్ దంపతుల సమేతంగా తరలి వెళ్లారు.


