భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 23 (అఖండ భూమి న్యూస్);
మొన్న కావాలని దూరుద్దేశంతో శాంతి భద్రతలు విఘాతం కల్గించడం కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రధాన మంత్రి ఇంటిని ముట్టడించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేస్తే పట్టణ పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ బీజేపీ శ్రేణులు దిష్టి బొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశం ప్రారంభమైన తర్వాత దేశానికి ఉపయోగపడే బిల్లులు ఆమోదించే క్రమంలో గౌరవ నరేంద్ర మోదీ పని చేస్తుంటే, కావాలని శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనే దురుద్దేశంతో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని ఇంటిని ముట్టడించడం దురదృష్టకరం. దేశ విద్రోహ శక్తులను ఉసిగొల్పి దేశంలో అశాంతి నెలకొల్పడమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం అని, నీట్ పరీక్షల ముసుగులో కాంగ్రెస్ మరియు ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలను అందరూ గమనిస్తున్నారు. నీట్ ను అడ్డుపెట్టుకొని కమ్యూనిస్టులు, దేశ వ్యతిరేక శక్తులు దేశాన్ని విడగొట్టాలని కుట్రలు చేస్తున్నారనీ ఆర్టికల్ 370 ని మళ్లీ తీసుకురావాలని, ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలని మాట్లాడుతున్నారు. అసలు సనాతన ధర్మానికి, ఆర్ఎస్ఎస్ కు మరియు నీట్ పరీక్షలకు సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు.
ఇది నవ భారతం, మోదీ గారి భారతం. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల కుట్రలకు బీజేపీ ఏమాత్రం భయపడదనీ, మోదీ గారిని బలహీనపరుస్తామనే పగటి కలలు కనడం రాహుల్ గాంధీ గారు ఇకనైనా మానుకోవాలనీ హితవు పలికారు. సీనియర్ సిటిజన్ వయస్సుకు దగ్గర పడుతున్న ఆయన కాస్త పరిణితితో ప్రవర్తిస్తే మంచిదనీ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


