బాలసదనం నుండి చిన్నారిని అంతర్ రాష్ట్ర కేరళ దంపతులకు దత్తత…

బాలసదనం నుండి చిన్నారిని అంతర్ రాష్ట్ర కేరళ దంపతులకు దత్తత…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 12 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లాలోని బాలసదనం నుండి ఒక చిన్నారిని అంతర్‌రాష్ట్ర దత్తత ప్రక్రియ ద్వారా కేరళ రాష్ట్రానికి చెందిన దంపతులకు దత్తతగా అప్పగించారు.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, బాలసదనంలో సంరక్షణ పొందుతున్న చిన్నారి శాంతను కేరళ రాష్ట్రానికి చెందిన దంపతులు సుర్జన్ మరియు వీణీర్హా దత్తత తీసుకున్నారు. దత్తత అనంతరం చిన్నారికి అద్వికా పి.ఎస్. అనే కొత్త పేరు పెట్టారు.

చిన్నారి సంక్షేమం, భవిష్యత్ అభివృద్ధి మరియు కుటుంబ వాతావరణంలో పెరిగే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో చట్టబద్ధమైన అన్ని నిబంధనలను అనుసరించి దత్తత ప్రక్రియ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!