*విడాకుల్లో దేశంలోనే తమిళనాడు టాప్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 15 (అఖండ భూమి న్యూస్);
కేంద్ర హోం మంత్రిత్వశాఖకు చెందిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్సారెస్)’ తాజా నివేదిక ప్రకారం, విడాకులు తీసుకున్నవారి జనాభాలో దేశంలో తమిళనాడే అగ్రస్థానంలో ఉంది. ఇందులో పురుషులు 2.9% కాగా, మహిళలు ఏకంగా 11.6% ఉన్నారు. అలాగే, దేశంలోనే అత్యధికంగా 51.9% వివాహిత జనాభా ఇక్కడే ఉన్నారు. మరోవైపు, స్థిరపడిన తర్వాతే పెళ్లి అనే ధోరణి పెరగడంతో, రాష్ట్రంలో 81% మంది మహిళలకు 21 ఏళ్లు దాటిన తర్వాతే వివాహాలు జరుగుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.


