ఉద్యోగులు బదిలీపై వెళ్లడం సహజం…

ఉద్యోగులు బదిలీపై వెళ్లడం సహజం…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 19 (అఖండ భూమి న్యూస్);

ప్రభుత్వ ఉద్యోగులు బదిలీపై వెళ్లడం సహజమేనని పలువురు ఉద్యోగులు అన్నారు. శుక్రవారం దోమకొండ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ దోమకొండ నుండి మాచారెడ్డి మండలానికి ఎంపీడీవో గా బదిలీపై వెళ్లడంతో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ , ఎస్సై ప్రభాకర్ ,మాజీ జెడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్, సీతారాం మధు ముదిరాజ్, ఎంఈఓ విజయ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!