శబ్దీపూర్ లో ఘనంగా శీతల పండగ…

శబ్దీపూర్ లో ఘనంగా శీతల పండగ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 7 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి మండలం శబ్దిపూర్ గ్రామం ఎడమ తాండలో శీతల పండగ మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఎడమ తండాలో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఇష్టమైన, ఆరాధ్య దైవమైన గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా నిర్వహించే శీతల పండగ ప్రత్యేకతపై గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో వేడుకున్నారు. తమ కోరుకున్న, నెరవేర్చాలని వేడుకున్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా శీతల పండగను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తాండ గ్రామస్తులు తెలిపారు. తీర్థ ప్రసాద వినియోగం, పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మలత్ గోపాల్, బిీకరభారి గంగారం నాయక్, గుడి పూజారి లాల్ నాయక్, ఆలయ చైర్మన్ మెగావత్ సేమియా, సర్పంచ్ మలావత్ సీతారాం నాయక్, మాన్సింగ్ రమేష్ వాసత్ జి పి పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!