గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరంలో దారుణం జరిగింది. సగం కాలిన స్థితిలో ఉన్న రెండు మృతదేహాలు కలకలం రేపాయి. గన్నవరం మండలం సావరగూడెం సమీపంలోని బుడమేరు కాలువ వద్ద ఉన్న మామిడితోటలో సగం కాలిన స్థితిలో ఉన్న ఇద్దరి మృతదేహాలను ఆదివారం స్థానిక రైతులు గుర్తించారు..
వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరిస్తున్నారు.
రెండు మృతదేహాల్లో ఒకరిది స్థానికంగా తిరుగాడే యాచకుడిదిగా గుర్తించినట్టు సీఐ కనకారావు తెలిపారు. మామిడితోట యజమాని ఇతర ప్రాంతంలో ఉండటంతో అక్కడికి వచ్చిన యాచకుడు.. సుమారు వారం రోజుల క్రితం మృతి చెంది ఉంటారని వెల్లడించారు. ఎండ తీవ్రత కారణంగా మృతదేహం కాలినట్లు మారిందన్నారు. మరో మృతదేహం సుమారు 35 ఏళ్ల వయసున్న వ్యక్తిదిగా గుర్తించామన్నారు. చేతికి ఉన్న కడియం ఆధారంగా క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు..
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…



