Satya kumar: ‘కోడికత్తి’ తరహాలో అవినాష్రెడ్డి డ్రామా: భాజపా నేత సత్యకుమార్
తిరుపతి: నాలుగేళ్లలో సీఎం జగన్ నమ్మకద్రోహంతో నయవంచక పాలన అందించారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. రాజధాని అంశంతో పాటు రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధర, బిందు సేద్యం తదితర అంశాల్లో సీఎం మోసం చేశారని ఆరోపించారు..
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యకుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి.. దారిదోపిడీకి మించిపోయిందన్నారు. పంచభూతాల్లో ఏ ఒక్కదాన్నీ వదలకుండా వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘కోడికత్తి’ తరహాలో ఎంపీ అవినాష్రెడ్డి డ్రామా కొనసాగుతోందని ఎద్దేవా చేశారు.
”మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు అవినాష్రెడ్డి సహకరించడం లేదు. సీబీఐకి రాష్ట్ర పోలీసులు సహకరించకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. అవినాష్ అరెస్ట్ ఖాయం. వైకాపాలో సంస్కారం లేని వ్యక్తులు భాజపాపై విమర్శలు చేస్తున్నారు. యువతకు మెగా డీఎస్సీ అని జగన్ నమ్మకద్రోహం చేశారు. రాష్ట్రంలో రీసర్వే పేరుతో అటవీ, వివాదాస్పద, ప్రభుత్వ భూములను గుర్
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



