Satya kumar: ‘కోడికత్తి’ తరహాలో అవినాష్రెడ్డి డ్రామా: భాజపా నేత సత్యకుమార్
తిరుపతి: నాలుగేళ్లలో సీఎం జగన్ నమ్మకద్రోహంతో నయవంచక పాలన అందించారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. రాజధాని అంశంతో పాటు రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధర, బిందు సేద్యం తదితర అంశాల్లో సీఎం మోసం చేశారని ఆరోపించారు..
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యకుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి.. దారిదోపిడీకి మించిపోయిందన్నారు. పంచభూతాల్లో ఏ ఒక్కదాన్నీ వదలకుండా వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘కోడికత్తి’ తరహాలో ఎంపీ అవినాష్రెడ్డి డ్రామా కొనసాగుతోందని ఎద్దేవా చేశారు.
”మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు అవినాష్రెడ్డి సహకరించడం లేదు. సీబీఐకి రాష్ట్ర పోలీసులు సహకరించకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. అవినాష్ అరెస్ట్ ఖాయం. వైకాపాలో సంస్కారం లేని వ్యక్తులు భాజపాపై విమర్శలు చేస్తున్నారు. యువతకు మెగా డీఎస్సీ అని జగన్ నమ్మకద్రోహం చేశారు. రాష్ట్రంలో రీసర్వే పేరుతో అటవీ, వివాదాస్పద, ప్రభుత్వ భూములను గుర్