కర్ణాటక మంత్రివర్గ విస్తరణ.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం నాడు 24 మంది మంత్రుల పేర్లను ఖరారు చేస్తూ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియను పూర్తి చేసింది..
అయితే లింగాయత్ ఓటు బ్యాంకును బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు సహకరించిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాదిలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. మంత్రుల జాబితాను రాజ్భవన్కు పంపించారు. ఈరోజు ఉదయం 11.45 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది..



