తెలుగుజాతి పునర్నిర్మాణానికి కృషి చేయాలి

 

 

తెలుగుజాతి పునర్నిర్మాణానికి కృషి చేయాలి

టీడీపీ అధికారంలో ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తయ్యేది

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది*

గంజాయి క్యాపిటల్‌గా విశాఖను మార్చారు*

జగన్‌ పాలనలో యువత నిర్వీర్యం అయిపోయారు

ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి:- తెలుగు ప్రజలు ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం నిరంతరం టీడీపీ శ్రమించిందన్నారు. ఎన్టీఆర్‌ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఏపీలో రెండో తరం సంస్కరణలు తీసుకొచ్చామని వివరించారు. దేశానికి దశ దిశ నిర్దేశించిన వ్యక్తి పీవీ నరసింహారావు అని, 1991లో పీవీ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారన్నారు. అలాంటి వ్యక్తి తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు. తెలుగుజాతి పునర్నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరముందని పునరుద్ఘాటించారు. తెలుగుజాతి పునర్నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరముందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.*

నాడు సమైక్యాంధ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశా. సంపద సృష్టించి సంక్షేమ పథకాలను పేదలకు అందించాం. నాలెడ్జ్‌ ఎకానమీకి ఐటీ నాంది పలుకుతుందని ఆనాడే చెప్పాం. సంస్కరణలకు సాంకేతిక జోడించి ముందుకు వెళ్లాం. విభజన జరిగిన తర్వాత పరిపాలన, ప్రభుత్వ విధానాల ద్వారా ఎవరికీ ఇబ్బంది లేకుండా చేశాం. నవ నిర్మాణ దీక్ష పేరుతో నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషిచేశాం. సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ దిశగా ముందుకెళ్లాం. విభజన వేళ ఏపీకి రూ.1.10 లక్షల కోట్ల అప్పు వచ్చింది. రూ.16వేల కోట్లు లోటు బడ్జెట్‌ ఉంది. సవాళ్లను అధిగమించి 2029 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాం. 2029 నాటికి ఏపీ నంబర్‌ వన్‌గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నదులు అనుసంధానిస్తే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే వీలు కలుగుతుందని భావించాం. అందులో భాగంగానే రూ.64 వేల కోట్ల ఖర్చుతో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాం. పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తి చేశామన్నారు.

 

2025కి ఫేజ్‌-1 పూర్తి చేస్తామని సిగ్గు లేకుండా వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రాజెక్టు పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేని దుస్థితి ఏర్పడింది. ప్రజల జీవనాడి పోలవరాన్ని సర్వనాశనం చేసి రాష్ట్ర ప్రగతిని, మన భవిష్యత్తును అడ్డుకునే పరిస్థితికొచ్చారు. అదే టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 జూన్‌ నాటికి పోలవరం పూర్తయ్యేది. ఆనాడు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మనం నెంబర్‌ వన్‌గా నిలిచాం. 2015లో రెండో స్థానంలో ఉండగా 2016, 2017, 2018, 2019 తర్వాత కూడా అగ్రస్థానంలో ఉన్నాం. ఈరోజు ఎఫ్‌డీఏలో రాష్ట్రం అధమ స్థానంలో ఉంది. ఐటీ ఎక్స్‌పోర్ట్స్‌లో 0.02 శాతంగా ఉంది. అదే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.లక్షా 83 కోట్లు. జగన్‌ పాలనలో యువత నిర్వీర్యం అయిపోయారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. గంజాయి క్యాపిటల్‌గా విశాఖను మార్చారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశామని, ఉద్యోగులకు 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని చంద్రబాబు వివరించారు.

సన్ రైజ్ ఏపీగా మార్చాం: సన్ రైజ్ ఏపీగా మారుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ) స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాల భూసేకరణ చేశామని, 3 రాజధానులు పేరుతో అమరావతి నిర్మాణం నాశనం చేశారని దుయ్యబట్టారు. జూన్ 2 ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన రోజని, టీడీపీ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. నవనిర్మాణ దీక్షతో ప్రజల్లో ఒక చైత్యన్యం తెచ్చామని చంద్రబాబు తెలిపారు. పోలవరం ద్వారా నదుల అనుసంధానంతో ఏపీని సస్యశ్యామలం చేయాలనుకున్నామని తెలిపారు. నవ్యాంధ్ర కోసం 2029 విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని, జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. మధ్యలో రాజధాని పెట్టామని, రాజధాని కంటిన్యూ అయి ఉంటే ఇప్పటికే రూ.2 లక్షల కోట్ల సంపద వచ్చుండేదని చంద్రబాబు తెలిపారు. నీతిఆయోగ్ సూచనల మేరకే పోలవరం నిర్మాణం ఏపీకి అప్పజెప్పారు. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేశాక పోలవరాన్ని జగన్ రివర్స్ చేశారు. టీడీపీ హయాంలో రూ.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఏపీలోఎఫ్డీఐలు అధమ స్థానంలో ఉన్నాయి. ఏపీని ఐటీ హబ్ చేయాలనుకుంటే గంజాయి హబ్‌గా మార్చారు. విట్, ఎస్ఆర్ఎం, అమృత్ వంటి యూనివర్శిటీలు తెచ్చాం. విజయనగరంలో గిరిజన వర్శిటీకి మేం భూమిస్తే వైసీపీ ప్రభుత్వం ఆపేసింది. అమరావతి-అనంతపూర్ ఎక్స్ప్రెస్ వేయాలని మేం భావిస్తే అమరావతి-ఇడుపులపాయకు ఆ రోడ్డు మార్చారు. వాళ్ల వ్యాపారాల కోసమే వైసీపీకి సీట్లు ఇచ్చినట్లు అయిందని చంద్రబాబు విమర్శించారు.*

*జగన్‌కు తెలివి తేటలు ఎక్కువ : కేసుల నుంచి బయటపడితే చాలు.. సీబీఐ అరెస్ట్ చేయకుంటే చాలని సీఎం జగన్ భావిస్తున్నారని చంద్రబాబు ఎద్దేవాచేశారు. ఏపీకి, తెలంగాణకు ఆదాయంలో రూ.11,600 కోట్లు తేడా ఉందని తెలిపారు. పేటీఎం బ్యాచ్ దీనికేం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. ఏపీ అనాధగా మారిందని, దీన్ని పునర్నిర్మిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒకటో తేదీన జీతాలివ్వమని ఉద్యోగులు అడిగితే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు డబ్బుల పిశాచాల్లా తయారయ్యారని ధ్వజమెత్తారు. ‘‘సీఎంకు తెలివి తేటలు ఎక్కువ. ఏ యూనివర్శిటీలో చదివారో మాత్రం చెప్పరు. టీడీపీ మేనిఫెస్టో అద్భుతమని స్వయంగా జగనే చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు.*

Akhand Bhoomi News

error: Content is protected !!