గొల్ల కురుమలు ఆర్థికంగా ఎదగాలి
పినపాక జూన్ 9 అఖండ భూమి వెబ్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం హనుమాన్ ఫంక్షన్ నందు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో రెండోవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు,జిల్లా కలెక్టర్ శ్రీ దురిశెట్టి అనుదీప్ గార్ల చేతుల మీదుగా లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది.ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ యాదవుల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, వారికోసం మేకలు,గొర్లు సబ్సిడీ పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.యాదవుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెలను పంపిణీ చేసి వారి అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు.రాష్ట్రంలో ఉన్న యాదవ సోదరులందరు ఆర్థికంగా బోలోపేతం కావాలని రానున్న కాలంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర వారే పోషించే విధంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ పథకాన్ని తీసుకువచ్చారు అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన అందరికీ గొర్రెల పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం