కులవృత్తుల,చేతివృత్తిదారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువైన చెక్కులు అందజేత
బూర్గంపహాడ్ జూన్ 9 అఖండ భూమి వెబ్ న్యూస్ : వెనుకబడిన తరగతుల్లోని కులవృత్తుల్లో ఉన్నవారికి,చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు బ్యాంకు లింకేజీ లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత నిర్ణయం మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని 9 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల విలువైన చెక్కులను అందించిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు మరియు జిల్లా కలెక్టర్ అనుదీప్ లబ్ధిదారులతో పాటు ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, అధికారులు బూర్గంపహాడ్ మండల ఎంపిడిఓ వివేక్ రామ్, పంచాయితీ రాజ్ ఎఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



