ఒలంపిక్ డే రన్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా.

 

ఒలంపిక్ డే రన్ లో పాల్గొన్న

జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా.

అమలాపురం అఖండ భూమి వెబ్ న్యూస్ :

ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ అగ్రహారం వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన

ఒలంపిక్ డే రన్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా ప్రారంభించారు.జిల్లాలో

గత 22 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ మెట్ల వెంకట సూర్యనారాయణ నేతృత్వంలోనిర్వహించబడుతుంది

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తో పాటు ఒలంపిక్ డే రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి కాశీ విశ్వనాథం రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, అమలాపురం జోన్ వ్యాయామ ఉపాధ్యాయులు వాకర్స్ క్లబ్ సభ్యులు,ఆజాద్ ఫౌండేషన్ సభ్యులు,లైన్స్ క్లబ్ సభ్యులు, రోటరీ క్లబ్ సభ్యులు,చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు,కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు,ఆఫీసర్ రిక్రియేషన్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!