ఉపాధి పనులు ఒక్క పూట పెట్టాలి.
వేసవి అల్వాన్స్ ఇవ్వాలి- మే 15 న జిల్లా కలెక్టర్ ఆఫ్ఫిసు వద్ద ధర్నా…!
- పార్వతీపురం (అఖండ భూమి ) :పార్వతీపురం సిఐటియు కార్యాలయంలో రెడ్డి ఈశ్వరరావు గారి అధ్యక్షతన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ వామపక్షాలు ,వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజాసంఘాల పోరాటం వలన ఉపాధి హామీ చట్టం వచ్చిందని ఉపాధి చట్టం వచ్చిన తర్వాత వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనుల్లో కూడా కూలి పనులు పెరిగాయని , కూలీ పెరిగిందని అన్నారు. శనివారం కౌలు రైతులు, రైతులు, వ్యవసాయ కూలీలు వలస కూలీలు, నిరుద్యోగ యువతీ యువకులు, అంతమంది కూడా ఉపాధి పనులపై ఆధారపడి గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారని అటువంటి ఉపాధి చట్టాన్ని నిర్వేర్యం చేయడానికి నరేంద్ర మోడీ బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు కరోనా సమయంలో సుమారు 15 కోట్ల మంది వలస కూలీలు గ్రామాల్లోకి వచ్చారని వీరందరికీ ఉపాధి ఎంతో ఆసరాగా ఉన్నదని అలాగే గ్రామాల్లో నిరుద్యోగ యువతీ యువకులు డిగ్రీలు,పీజీలు చేసిన వాళ్లు కూడా ఉపాధి పనుల్లో పాల్గొంతున్నారనిఇంత కీలకమైన ఉపాధి చట్టాన్ని పనులను నిర్వీర్యం చేయడానికి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు రెండు పూటలా పని పెట్టడం వలన కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారని గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా వడదెబ్బలకు గురై కొంతమంది చనిపోయారని గరుగుబిల్లి మండలం నాగూర్ లో ఎచ్చెర్ల లక్ష్మి అనే మహిళ వడదెబ్బకు గురై ఉపాధి పనిలో చనిపోయిందని అన్నారు అలాగే గతంలో ఇస్తున్న వేసఆలవెన్సులు, మేట్లకి ఇచ్చిన ప్రోత్సాహకాలు, మంచినీరు, మజ్జిగ, ఇవేవీ ఇవ్వకుండా ఈ పనులు మాకు వద్దు బాబోయ్ అని వ్యవసాయ కూలీలతో అ�
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



