Amanchi Krishna Mohan: పాముకాటుకు గురైన ఆమంచి కృష్ణమోహన్
పర్చూరు: బాపట్ల జిల్లా పర్చూరు వైకాపా నేత ఆమంచి కృష్ణ మోహన్ను పాము కాటేసింది. వేటపాలెం వద్ద రొయ్యల ఫ్యాక్టరీలో వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది..
దీంతో అనుచరులు ఆయన్ను చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు..



