YSRCP: తాడేపల్లికి రామచంద్రపురం పంచాయితీ.. జగన్తో పిల్లి సుభాష్ భేటీ
అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం (Ramachandrapuram) నియోజకవర్గ వైకాపా (YSRCP) పంచాయితీ తాడేపల్లికి చేరింది. సీఎం జగన్తో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (Pilli Subhash chandrabose) భేటీ అయ్యారు..
మంత్రి వేణుగోపాలకృష్ణపై సీఎంకు ఆయన ఫిర్యాదు చేశారు. మంత్రి, ఆయన వర్గీయుల వ్యవహారశైలిని బోస్ వివరించారు. తన అనుచరుడు శివాజీపై మంత్రి అనుచరుడి దాడిపై జగన్కు ఆయన ఫిర్యాదు చేశారు. సుమారు అరగంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది..



