Bengaluru: బెంగళూరులో పేలుళ్లకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరు(Bengaluru)లో ఉగ్రదాడులకు జరుగుతోన్న కుట్రలను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(Central Crime Branch (CCB) భగ్నం చేసింది..
ఐదుగురు అనుమానితులను అరెస్టు చేశారు. అలాగే వారి దగ్గర ఉన్న పేలుడు పదార్థాలు, ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉగ్రకుట్రకు సంబంధించి మరో ఐదుగురు అనుమానితుల కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు..
బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని సీసీబీ(CCB)కి సమాచారం అందింది. ఈ క్రమంలో అరెస్టులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం సీసీబీ అదుపులో ఉన్న వ్యక్తులకు 2017లో జరిగిన ఓ హత్య కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆ కేసులో బెంగళూరులోని సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో వారికి ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, పేలుడు పదార్థాల వాడకంలో శిక్షణ పొందారని తెలిపాయి..



