గాలి వానలకు 20 గొర్రెలు మృతి….
యాదాద్రి కొత్తగూడెం జిల్లా అడ్డగూడురు జులై 20 అఖండ భూమి వెబ్ న్యూస్ :
మండల కేంద్రమైన అడ్డగూడూరు గ్రామానికి చెందిన నోముల నవీన్ అనే గొర్రెల రైతు కు 20 గొర్రెలు గురువారం గాలి వాన ప్రభావంతో మృతి చెందినట్లు తెలిపారు. గత నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా గాలి వాన లకు తట్టుకోలేక మృతి చెందినట్లు గొర్రెల రైతు నోముల నవీన్ వాపోయారు. ఎన్నో సంవత్సరాల నుండి జీవాలను బ్రతికించుకొని కాయకష్టంతో పెంచుకున్న గొర్రెలు మృతితో దాదాపు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గొర్రెల రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని అడ్డగూడురు మండల ప్రజలు కోరుతున్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…



