తపో వనంలో పురుషోత్తమ సపర్య పూజోత్సవం.

స్వామివారి ఆశీస్సులు పొందిన యనమల కృష్ణుడు
కోటనందూరు (అఖండ భూమి):
ఈ ఏడాది అధిక శ్రావణమాసం ఈ నేపథ్యంలో అధిక శ్రావణ పౌర్ణమి పురస్కరించుకొని కుమ్మరి లోవ తపో వనంలో పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పురుషోత్తమ సపర్య పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు, సీనియర్ తెలుగుదేశం నాయకులు పోల్నాటి శేషగిరిరావు, మోతుకూరి వెంకటేష్, జిల్లా వెలమ కమిటీ కన్వీనర్ పోతల రాంబాబు, తుని నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్ జక్కాన రామానాయుడు, తుని టౌన్ బీసీ సెల్ సెక్రెటరీ జగన్మోహన్, దూలం వీరబాబు,ప్రత్యేక పూజలు చేసి స్వామివారినిదర్శించుకున్నారు.


