కూకట్పల్లి నూతన ఏసీపీని మర్యాద పూర్వకంగా కలిసిన కర్క నాగరాజు
అఖండ భూమి ఆగస్టు 02 కూకట్ పల్లి వెబ్ న్యూస్ :
కూకట్పల్లి నూతన ఏసీపీ గా ఇటీవల పదవి భాద్యతలు స్వీకరించిన పెద్ధిరెడ్డి శివభాస్కర్ ని బిఆర్టియూ కార్మిక విభాగం కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కర్క నాగరాజు మర్యాదపూర్వకం గా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపి అంబేద్కర్ చిత్ర పటాన్ని వారికి బహుకరించారు. అనంతరం కర్క నాగరాజు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకై భారత రాజ్యాంగం కల్పించిన చట్టాలను గౌరవిస్తూ ప్రతి పౌరుడు పోలీస్ లకు విధిగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ టియూ కార్మిక విభాగం కూకట్పల్లి నియోజకవర్గం ఆర్గనైసింగ్ సెక్రటరీ పాషా, కోశాధికారి జగన్, ఎఐఎవైయస్ గ్రేటర్ హైదరాబాద్ ఆర్గనైసింగ్ సెక్రటరీ జక్కుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



