నూకాంబికా అమ్మవారికి
రజత త్రిశూలం బహుకరణ.
ఆలమూరు (అఖండ భూమి):ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారికి ఆదివారం నాడు కొత్తూరు సెంటర్లో గల శ్రీ సీతారామ ఏజెన్సీస్ పెట్రోల్ బంక్ అధినేత కొవ్వూరి భాస్కర్ రెడ్డి కుమార్తె దేవి చైతన్య,సీతారామరెడ్డి దంపతులు 1.376 కేజీల వెండితో చేయించిన రూ.1.05 లక్షల విలువగల రజత త్రిశూలం బహూకరించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ నూకపెయ్యి సూరిబాబు,వైసీపీ నాయకులు నామాల శ్రీనివాస్,చింతలూరు ఫణి,మార్గాని ఏసు,దేవస్థానం అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.



