ప్రారంభం కానీ బొర్రా రైతు భరోసా భవనం.
అల్లూరు జిల్లా : అనంతగిరి అఖండ భూమి 21 ఆగస్టు అల్లూరి జిల్లా హెడ్ న్యూస్ :
అనంతగిరి, బొర్రా సచివాలయం కి ఆనుకుని ఉన్న రైతు భరోసా భవనం పనులు పూర్తి అయి నెలలు గడుస్తున్న భవనం వినియోగంలోకి రాకపోవడంతో, స్థానిక రైతులు, ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వము నుండి రైతులకు అందే సబ్సిడీ విత్తనాలు, ఇతర వస్తువులు వచ్చినప్పుడు పెట్టుకొనుటకు భవనం లేక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రైతు భరోసా భవనాన్ని ప్రారంభించి రైతులకు అందుబాటులోకీ తేవాలని స్థానికులు కోరుకుంటున్నారు.



