
గిరిజన ప్రాంతం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
ఎమ్మెల్సీ అనంత బాబు ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ పథకాలు
రాజవొమ్మంగి సెప్టెంబర్ 16 అఖండ భూమి అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండల ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలం వివిధ గ్రామాలలో ఎమ్మెల్సీ అనంతబాబు పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు, ముందుగా రాజవొమ్మంగి మండలం చేరుకుంపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం ఆర్ బి కే హెల్త్ సెంటర్ భవనాలను ఆయన ప్రారంభించారు, అనంతరం రాజవొమ్మంగి మండలం ఓట్టిగడ్డ గ్రామంలో 42 లక్షల రూపాయలతో మంజూరైన నిర్మితమైన సచివాలయం నూతన భవనాన్ని ఎమ్మెల్సీ అనంత బాబు ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , ఈ గ్రామలలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ నాలుగున్నర సంవత్సరాల మన ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఆయా పథకాల ద్వారా లబ్ధిదారులకు నగదు ఎంత వచ్చిందో కూడా తెలియజేశారు. రానున్న కాలంలో కూడా ఈ సంక్షేమ పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని తెలియజేశారు. అర్హత ఉండి, సంక్షేమ పథకాలు అందని వారికి , సరిచేసి, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేచించారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని, వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ, మండల ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, జడ్పిటిసి ఒడుగుల జ్యోతి, వైస్ ఎంపీపీ, మండలంలో సర్పంచులు గృహ సారథులు, వైస్ ఎంపీపీలు, కన్వీనర్లు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు,


