నేడు ఢిల్లీ కు సీఎం కేసీఆర్*హైదరాబాద్, దిల్లీ: దిల్లీలోని వసంత్ విహార్లో నిర్మిస్తున్న భారాస కేంద్ర కార్యాలయాన్ని (తెలంగాణ భవన్) ఈ నెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం దిల్లీకి ఆయన వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. నాలుగు అంతస్తులుగా భవనాన్ని నిర్మించారు. సోమవారం సాయంత్రమే మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ దిల్లీకి పయనమయ్యారు. ‘దిల్లీలో తెలంగాణ పదమే పలకడానికి, వినడానికి అవకాశాల్లేని పరిస్థితుల నుంచి ఇక్కడి నడిబొడ్డున భారాస సొంత కార్యాలయ భవనాన్ని నిర్మించుకునే స్థాయికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అని మంత్రి ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.. భారాస కేంద్ర కార్యాలయం పనులను సంతోష్కుమార్తో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


