వైసీపీ ప్రభుత్వం ఓ నూతన అధ్యాయం..
సచివాలయ మండల కన్వీనర్ హనుమంతు
తుగ్గలి మే 3 (అఖండ భూమి) :
వైయస్సార్సీపి చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయంగా నిలిచిందని సచివాలయ మండల కన్వీనర్ ఆర్ హనుమంతు అన్నారు. బుధవారం శభాష్ పురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా జగనన్నే మా భవిష్యత్తు పేరుతో చేపట్టిన పీపుల్స్ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 1.10 కోట్ల కుటుంబాలు జగనన్న సర్కారుకు మద్దతు తెలిపారు అన్నారు. జగనన్న పాలనపై రాష్ట్ర జనాభాలో 80 శాతం మంది ప్రజలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సిపికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజల మద్దతుతోనే ప్రతి ఇంటికి స్టిక్కర్లను అతికిస్తున్నామని , ఇందులో ఎవరిని బలవంతం చేయడం లేదని ఆయన అన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి జగనన్నకి చెబుదాం పేరుతో నూతన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు మరోసారి వెళ్తున్నామని పేర్కొన్నారు. దిగవ చింతల కొండ వైఎస్ఆర్సిపి నాయకులు సురేంద్ర మాట్లాడుతూ శభాష్ పురం పంచాయతీలో ఎమ్మెల్యే శ్రీదేవమ్మ సహకారంతో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు సచివాలయ మండల కన్వీనర్ హనుమంతు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌరవ సలహాదారుడు గుంటుపల్లి రవి, ఎంపీటీసీ రామాంజనమ్మ ,సర్పంచ్ పుష్పవతి తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం