కారులో బోల్తా.. బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి

 

 

కారులో బోల్తా.. బయటపడిన 2 క్వింటాళ్ల గంజాయి

జహీరాబాద్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు..

భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన స్మగ్లర్లు.. కారు, గంజాయిని అక్కడే వదిలేసి పరారైనట్లు వివరించారు. వీటిని స్వాధీనం చేసుకొని చిరాగ్‌పల్లి ఠాణాకు తరలించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు..

Akhand Bhoomi News

error: Content is protected !!