బైర్మల్ వీధి,చైనా బజార్ లో బిజెపి ప్రచారం.

 

 

బైర్మల్ వీధి,చైనా బజార్ లో బిజెపి ప్రచారం.

నంద్యాల ఫిబ్రవరి 23 (అఖండ భూమి) న్యూస్:

నంద్యాల నియోజక వర్గంలో బిజెపి జోరు పెంచింది.రానున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలో బిజెపి,రాష్ట్రంలో బిజెపి వుండాలని అధిష్టానం భావిస్తోంది.రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పార్టీ అసెంబ్లీ కన్వీనర్ లను ప్రకటించింది.రాష్ట్రం లోని అన్ని జిల్లాల్లో బిజెపి నాయకులు వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్ళి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.నంద్యాల లో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి ఎన్నికైనప్పటి నుంచి జోరు పెంచారు.రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నంద్యాల లో పర్యతుంచడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో ప్రచార జోరు కొనసాగిస్తున్నారు.పార్టీ ఆదేశాల మేరకు ప్రజా పోరు యాత్రను రెండు రోజులుగా పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ చేపట్టిన పథకాలు వివరిస్తూ,రాష్ట్ర పరిస్థితులు వివరిస్తూ అభిరుచి మార్క్ ను సొంతం చేసుకుంటున్నారు.అధిష్టానం ఆశీస్సులు మెండుగా వుండడంతో అధికార పార్టీ నాయకుల అవినీతి,అరాచకాలను తూర్పురబట్టుతున్నారు.నంద్యాల అధికార పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు దీటైన సమాధానం ఇస్తూ నేనున్నాను అనే బరోసా కల్పిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే పట్టణంలో వివేకానంద విగ్రహం నుంచి బైర్మల్ వీధి,చైనా బజార్ లో ప్రతి వ్యాపారస్తుల ను కలుస్తూ పార్టీ చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం సాగించారు.మైనార్టీ మహిళలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.

Akhand Bhoomi News

error: Content is protected !!