కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి – లెక్కల భాస్కర్
కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్ మీడియాతో మాట్లాడారు. ఈ వైసిపి పాలనలో పచ్చని సస్యశ్యామలంగా ఉండే కోస్తా జిల్లాలలో దాడులు, అరాచకాలు, హత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. నియోజవర్గంలోని దళితులపై, బడుగు బలహీన వర్గాలపై అన్యాయంగా అనేక దాడులు జరగడం బాధాకరమని ఆయన అన్నారు. అన్యాయానికి గురైన బాధితునికి న్యాయం జరగటం లేదని భాస్కర్ వాపోయారు. గాయపడిన బాధితులపై అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులను కుట్రపూరితంగా బనాయించడం దారుణమని ఆయన అన్నారు. నియోజకవర్గంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను,
ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. ఈ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ఈ పాలనను అంతమొందించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైన పాలన కొరకై తెలుగుదేశం పార్టీ ని గెలిపించాలని నియోజకవర్గంలో యనమల దివ్య ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
You may also like
అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం వేతనం తప్పనిసరి.. హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు:- నారాయుడు
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్