మానసిక వికలాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు

మానసిక వికలాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు

యర్రగొండపాలెం అఖండ భూమి: యువ జర్నలిస్టు ఉప్పలపాటి యేసేబు పుట్టినరోజు వేడుకలు బుధవారం యర్రగొండపాలెం పట్టణంలోని మాచర్ల రోడ్డులో గల సన్ జో సేవాలయంలో ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి పంచి పెట్టారు. సన్ జో సేవాలయంలో నిర్వహకుడు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఉప్పలపాటి యేసేబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా యువ

జర్నలిస్టు ఉప్పలపాటి యేసేబు మాట్లాడుతూ సన్ జో సేవాలయంలో ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగులు, అనాధల మధ్య తన పుట్టినరోజు వేడుకలు మిత్రులతో కలిసి జరుపుకోవడం

చాలా ఆనందంగా ఉందన్నారు. పలువురు జర్నలిస్టులు, మిత్రులు యేసేబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

భవిష్యతులో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. అనంతరం మానసిక వికలాంగులకు

మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. వారంతా యేసేబును దీవించారు. అలాగే

రోడ్లవెంట ఉండే అనాధలు, అభాగ్యులకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ

కార్యక్రమంలో జర్నలిస్టులు షేక్ వలీసాహెబ్, మారపాకుల ఆంజనేయులు, ఆవుల

యేసుబాబు, షేక్ నాసర్వలి, కంచి బాల సుబ్రమణ్యం, షేక్ మహమ్మద్ ఖాసిం, తప్పెట్ల

కోటేశ్వరరావు, ఆలేటి అనిల్, ఉప్పలపాటి రమేష్, ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ గర్నెపూడి వినయ్,

నియోజకవర్గ అధ్యక్షుడు బరిగెల దాసుతో పాటు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!