కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం అంగన్వాడీ ఉద్యోగులు కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ మండల యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు ను మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. అనంతరం కలిసికట్టుగా శాలువా కప్పి సన్మానం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా అంగన్వాడీలు తమ సమస్యలను ఆయనకు వెలబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి యువ నాయకులు అంకంరెడ్డి బుల్లిబాబు మాట్లాడుతూ గ్రామం లో ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
తిరుమల లడ్డు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు
బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!
నూతన పాలకవర్గం భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి…
ది న్యూ రాజమండ్రి ప్రవైట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ ఎలక్ట్రీషియన్ డే వార్సికోత్సవం


