ఘనంగా పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
కర్నూలు ప్రతినిధి, జూన్ 13, (అఖండ భూమి న్యూస్) :
చలో హైదరాబాద్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలు నగర కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం నేషనల్ గోర్ బంజారా సమ్మోలణ్ ముఖ్య కార్యకర్తలతో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల మాట్లాడుతూ మా తండాలో మా రాజ్యం-మేము ఎంత మందిమో మాకు అంత వాటా అనే నినాదంతో 1997 జులై 1 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ సంఘం ఏర్పడి నేటికీ 27 సంవత్సరాలు పూర్తవుతుందన్నారు. సంఘo ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న బంజార జాతి ప్రతినిధుల సమావేశం ఉంటుందని తెలిపారు. జిల్లాలోని లంబాడి మేధావులు పెద్దలు, విద్యార్థులు అందరూ కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నేణావత్ రాము నాయక్, సేవలాల్ నాగరాజు నాయక్, రామాంజ నేయులు నాయక్, భాషా నాయక్, శ్రీను నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..