ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు రెండు రోజులు గాలింపు 

ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు రెండు రోజులు గాలింపు

కాలువలో గల్లంతయిన శరభన్నపాలెం గ్రామానికి చెందిన జయవర్ధన్ మృతదేహం లభ్యం

కొయ్యూరు అఖండ భూమి జూలై 28 అల్లూరి జిల్లా

కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామానికి చెందిన రీముల జయవర్ధన్ (బాబి )విశాఖపట్నం నుంచి వస్తు పెద్ద మాకవరం వద్ద జాతీయ రహదారి సంస్థ వేసినతాత్కాలిక వంతెన తుఫాను కారణంగాకురిసిన వర్షాలకు కొట్టుకుపోవడంతో కత్తి రాళ్లలోది గ్రామం మీదుగా స్వగ్రామం శరభన్నపాలెం వెళ్లేందుకు ప్రయత్నించి కాలువలో గత ఆదివారం సాయంత్రం ‌గల్లంతయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గజ ఈతగాళ్లతో కాలువలో ‌వెతికించిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో అల్లూరి జిల్లా కలెక్టర్కు మొర పెట్టుకోవడంతో ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు పంపించడంతోశనివారం నుండి గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది అయితే ఆదివారం కాలువలో మృతదేహం లభ్యమయింది.. దీంతో తల్లిదండ్రులు రీముల మోహన్ రావు, రాణి.లు మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న తీరును అక్కడున్న చూపరులను కలచవేసింది .ఈ గాలింపు చర్యలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటరమణ ఎస్సై రామకృష్ణ రెవిన్యూ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!