తెలంగాణ ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, నూతన జిల్లా అధ్యక్షులు చెదలు సత్తన్నలను ఘనంగా సన్మానించిన డాక్టర్ పేట భాస్కర్, టైగర్ ఆలీ నవాబ్

 

హైదరాబాద్ ప్రతినిధి అఖండ భూమి  వెబ్ న్యూస్ :

జిల్లా__ మున్నురుకాపు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్, జిల్లా నూతన అధ్యక్షులు చెదలు సత్యనారాయణ లను తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు టైగర్ ఆలీ నవాబ్ లు ఘనంగా సన్మానించారు.

ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బండారి గార్డెన్ లో జరిగిన మున్నురుకాపు సంఘం జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో నిజామాబాద్ ఎంపీ డి అరవింద్, తెలంగాణ ప్రభుత్వ విప్ లు అది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కాపు సంఘం గౌరవ అధ్యక్షులు బాదినేని రాజేందర్ లు పాల్గొనగా కార్యక్రమం అంగరంగవైభవంగా సాగింది. ఈసందర్భంగా పేట భాస్కర్, ఆలీ నవాబ్ లు మాట్లాడుతూ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చెదలు సత్యనారాయణ నాయకత్వంలో సంఘం బలోపేతం కావాలని అందరినీ కలుపుకుని సంఘ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్లుతు అన్ని కుల సంఘాలకు ఆదర్శంగా నిలువాలని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పోలీస్ నజర్ న్యూస్ సీఈఓ షేక్ రహీమ్, తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు తాండ్ర శంకర్ గౌడ్,జగిత్యాల జిల్లా బ్యూరో షేక్ హసీబ్ ఇమ్రాన్, జగిత్యాల జిల్లా ఇంచార్జ్ జావేద్ హైదర్, జగిత్యాల టౌన్ రిపోర్టర్ మసూద్ ఖాన్, డివిజన్ రిపోర్టర్ ఇఎండి నయీమ్, వేములవాడ ఇంచార్జ్ చాంద్ పాషా, జగిత్యాల జిల్లా క్రైమ్ రిపోర్టర్ బుచ్చిరెడ్డి, డివిజన్ క్రైమ్ రిపోర్టర్ శంషుద్దీన్, కోరుట్ల డివిజన్ కెమెరామెన్ అబ్దుల్ సాదిక్, కథలాపూర్ రిపోర్టర్ అర్షద్, కాపు సంఘం జిల్లా ఉపాద్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, బండారి శంకర్, గంగపుత్ర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇట్యాల రాజేందర్, మాదిగ సంఘం అధ్యక్షుడు శనిగారపు రాజేష్, మోర్తాడ్ రాజశేఖర్, రమణ, సాజిద్, గంగారాంలతో పాటు జిల్లాలోని మున్నురుకాపులు ఇరవై మండలాలకు చెందిన మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు.

Akhand Bhoomi News

error: Content is protected !!