మీనా ఇడ్లీలో అడ్డంగా దోచేస్తున్నారు..?

 

మీనా ఇడ్లీలో అడ్డంగా దోచేస్తున్నారు..?

-కూరగాయల ధరల్లాగా.. ఇడ్లీల అమ్మకాలు..?

-రెండు తింటే 20.. నాలుగు తింటే 30 రూపాయలు..?

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్: 27 (అఖండ భూమి) ఆర్మూర్ పట్టణంలో విజయ్ పబ్లిక్ స్కూల్ వద్ద గల మీనా ఇడ్లీ సెంటర్లో మార్కెట్ లో కూరగాయల ధరల్లాగా కిలో టమాట 50.. అద్దకిలో 30 రూపాయలు అన్నట్టు రెండు ఇడ్లీలకు-20. నాలుగు ఇడ్లీలకు-30 రూపాయలు తీసుకుంటు కస్టమర్లను దోచేస్తున్నారు. అదేంటని అడిగితే రెండుకు 20.. నాలుగింటికి 30.. ఇవ్వాల్సిందేనని అంటున్నారు. రెండు ఇడ్లీలు తిని 15 రూపాయలు చిల్లర ఇచ్చిన రెండు ఇడ్లీలకు 20 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు..? ఇలా ఒక్కో కస్టమర్ కు ఐదు రూపాయల చొప్పున అదనంగా దోచేస్తూ లక్షలు గడిస్తున్నారు. వీరికి ఆర్మూర్లో. నిర్మల్లో బ్రాంచీలు ఉన్నాయి. ఇలా కస్టమర్లను దోచేస్తూ జిల్లాలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా మీనా ఇడ్లీ సెంటర్ల బ్రాంచీలు ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు..? దుకాణాల యజమానులు కస్టమర్లే దేవుళ్ళు అంటారు.. కానీ మీనా ఇడ్లీ సెంటర్లో మాత్రం కస్టమర్లనే దోచేస్తున్నారు ..? సంబంధిత అధికారులు మీనా ఇడ్లీ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!