రాకేష్ సి ఎస్ సి సెంటర్ ను ప్రారంభించిన పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట , మార్చి 30,(అఖండ బూమి న్యూస్): టేకుమట్ల గ్రామంలో రాకేష్ సి ఎస్ సి ఆన్లైన్ & జీరాక్స్ సెంటర్ ను తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గౌ, శ్రీ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు.
వారు మాట్లాడుతూ నిరుద్యోగులు ఉద్యోగం విషయం లో కాకుండా ఉపాధి అవకాశం ఇంకా ఇతర రంగాల్లో కూడా అభివృద్ధి సాధించాలని అన్నారు. గ్రామంలో ప్రజలకు అన్ని ఆన్లైన్ అప్లికేషన్, జీరాక్స్, లామినేషన్, ఇతర సదుపాయాలు సద్వినియోగం పరుచుకోవాలని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గట్టు శ్రీనివాస్, ఉర్లుగొండ దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, పట్టణ మాజీ కౌన్సిలర్ వెలుగు వెంకన్న, వల్దాస్ దేవేందర్, ఎడ్ల వీరమల్లు యాదవ్, మైనార్టీ నాయకులు ఫరూక్,పిల్లల రమేష్, టేకుమట్ల మాజీ ఎం పి టీ సి చింత అలివేలు, కేశవులు, టేకుమట్ల గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
You may also like
-
రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అంకంరెడ్డి బుల్లిబాబు
-
14 పంటలకు కనీస మద్దతు ధర పెంచడంపై మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…
-
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా బిబిపేటలో మోడల్ ఇందిరమ్మ ఇల్లు ముందు కాంగ్రెస్ నాయకుల ధర్నా…
-
లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి…
-
సీఎం రిలీఫ్ పాండును అందజేసిన ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…