ముదిరాజ్ సదర సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 30 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామంలో సదరు సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ కుల జెండా ను ఆదివారం అధ్యక్షులు పిడుగు స్వామి ఎగురవేశారు. ముదిరాజుల పండగ ఉగాది పండగ అని గుర్తు చేశారు. పండగ ప్రాముఖ్యతను, హిందూ సంప్రదాయాలను రేపటి భవిష్యత్తు పిల్లలకి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పుట్ట నరసింహులు,, అంది రాజయ్య, మండల వెంకటేశం, మెట్టు రాములు, అంది దేవరాజ్, పిడుగు చిన్నస్వామి, వందే మధు, పిడుగు మల్లయ్య, జంగిటి రాజు తదితరులు, సభ్యులు పాల్గొన్నారు.


