వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ జాతీయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరాల నిర్వహణకు గాను
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 25 (అఖండ భూమి న్యూస్);
వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ తెలుగు రాష్ట్రాల జాతీయ స్థాయి పురస్కారాలు -2025 కు ప్రకటించిన జాతీయ స్థాయి పురస్కారానికి కామారెడ్డి రక్తదాతల సమూహ వ్యవస్థాపకుడు,ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ఎంపిక కావడం జరిగిందని ఆదివారం నాడు గోదావరిఖనిలో అందుకోవడం జరుగుతుంది.ఈ అవార్డుకు ఎంపిక చేసిన సంస్థ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని వారి కోసం మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 2500 ల యూనిట్ల రక్తాన్ని సేకరించి అందజేయడం జరిగిందని ఈ సేవను గురించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకొని దేశంలోనే మొదటి సంస్థగా కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ లు సంయుక్తంగా నిలవడం జరిగిందని అన్నారు.ఈ పురస్కారం ఆదుకోవడానికి సహకరించ రక్తదాతలకు మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు